నిజంనిప్పులాంటిది

Apr 09 2024, 11:53

నేటి నుండి భద్రాద్రిలో శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు

ఇవాళ్టి నుండి భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామ నవమి వసంతపక్ష తిరు కళ్యాణ నవాహ్నిక బ్రహ్మో త్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి.

నేటి నుండి ఈ నెల 23వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.ఉదయం అంతరాలయం లోని ధ్రువ మూర్తుల వద్ద ఉత్సవాలకు అనుజ్ఞ తీసుకొని ధ్వజారో హణం చేయనున్నారు.

వేడుకల ప్రారంభానికి ముందుగా విశ్వక్సేన ఆరాధన, కర్మణ పుణ్యా హవాచన, రుత్విగ్వరణం, రక్షాబంధనం, స్నపన తిరు మంజనం, వాస్తు హోమం, ఉగాది పర్వదినం సంద ర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఉగాది ప్రసాద వితరణ, సాయంత్రం దర్బార్‌ సేవ తర్వాత నూతన పంచాంగ శ్రవణం తదితర కార్యక్రమాలను చేపట్టనున్నారు.

అలాగే కల్పవృక్ష వాహనంపై తాత గుడి సెంటర్‌ వరకు స్వామివారికి తిరువీధి సేవ నిర్వహించనున్నారు.శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవస్థానం ఈవో రమాదేవి తెలిపారు.

ఈ నెల 16వ తేదీన సాయంత్రం నేత్రపర్వంగా ఎదుర్కోలు ఉత్సవం, 17వ తేదీన శ్రీరామనవమి కళ్యా ణ మహోత్సవం, 18వ తేదీన పట్టాభిషేక మహోత్స వం జరగనున్నాయి.

బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్య కళ్యాణాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా మిథిలా ప్రాంగణంలో జరిగే వేడుకల కోసం కల్యాణ మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దు తున్నామని ఈవో వెల్లడించారు.

ప్రతి భక్తునికి స్వామివారి తలంబ్రాలు అందేలా ఈసారి 60 తలంబ్రాల కౌంటర్లు, స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులు కొను గోలు చేసేందుకు 19 కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. భక్తుల సౌకర్యం కోసం 2.50 లక్షల లడ్డూలు, 5 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను సిద్ధం చేశామని ఈవో రమాదేవి పేర్కొన్నారు...

నిజంనిప్పులాంటిది

Apr 08 2024, 22:07

TG Politics: నాపై కుట్ర జరుగుతోంది.. పడేయాలని చూస్తున్నారు : సీఎం రేవంత్

కోడంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్ర జరుగుతోందని, తనను కింద పడేయాలని చూస్తున్నారని మండిపడ్డారు..

సొంత నియోజకవర్గం కొడంగల్‌కు సోమవారం సీఎం రేవంత్ (Revanth) వచ్చారు. అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కొడంగల్ నుంచి 60 ఏళ్ల క్రితం అచ్యుతా రెడ్డి మంత్రి అయ్యారు. తర్వాత నియోజకవర్గం నుంచి మంత్రి పదవి చేపట్టలేదు. కొడంగల్ నుంచి గెలిచిన తనకు సోనియా గాంధీ అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. 100 రోజుల్లో కొడంగల్‌కు మెడికల్, ఇంజనీరింగ్, వెటర్నరీ, నర్సింగ్, జూనియర్, డిగ్రీ కాలేజీ తీసుకొచ్చానని సీఎం రేవంత్ వివరించారు. అలాంటి తనపై కుట్ర జరుగుతోందని హాట్ కామెంట్స్ చేశారు.

కుట్ర

'వందల కోట్లతో తండాలకు రోడ్లు తెచ్చా. రూ. 4వేల కోట్లతో నారాయణ్ పేట్- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చాం. కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీని ఓడించి, రేవంత్ రెడ్డిని కిందపడేయాలని కొందరు కుట్ర చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని ఎందుకు కింద పడేయాలి..? కరువు ప్రాంతానికి నారాయణ్ పేట్- కొడంగల్ ఎత్తి పోతల తెచ్చినందుకా..? కాలేజీలు తెచ్చినందుకా? సిమెంటు ఫ్యాక్టరీ తెచ్చి ఉపాధి కల్పిస్తున్నందుకా? బీజేపీలో జాతీయ ఉపాధ్యక్ష పదవి తెచ్చుకున్న అరుణ పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా తేలేదు. కొడంగల్‌ను అభివృద్ధి చేయనీయొద్దని అరుణ కుట్ర చేస్తోంది. కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి అని' సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

ఎందుకు ఓడించాలి

'లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలి..? ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకా? లేదంటే రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చినందుకా? 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నందుకా? ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నందుకా? పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొడంగల్‌లో ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్రూం ఇచ్చిందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఎందుకు రేవంత్ రెడ్డిని పడగొట్టాలి? కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించాలి? ఓట్ల కోసం మతాల మధ్య గొడవలు పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. పదేళ్లుగా ప్రధానిగా ఉన్న మోదీ ఈ ప్రాంతానికి ఏం చేశారు? మోదీకి మళ్లీ ఓటేస్తే చంద్రమండలానికి రాజవుతారా? అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు..

నిజంనిప్పులాంటిది

Apr 08 2024, 19:53

ప్ర‌ధాని మోడీపై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు

ప్ర‌ధాని మోడీపై ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించిన మ్యాని ఫెస్టో.. ముస్లిం లీగ్ త‌ర‌హాలో ఉన్న‌ట్లు ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ ఆరోపించిన విష‌యం తెలిసిందే.

ఏప్రిల్ 6వ తేదీన అజ్మీర్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ర్యాలీలో ఆయ‌న ఈ కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్య‌ల‌ను కాంగ్రెస్ పార్టీ త‌ప్పుప‌ట్టింది. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఓ అబద్ధాల పుట్ట అని, భార‌త్‌ను ముక్క‌లుగా చేసేందుకు కుట్ర జ‌రుగుతోంద‌న్నారు.

ప్ర‌ధాని మోడీ వ్యాఖ్య‌ల ప‌ట్ల కాంగ్రెస్ తీవ్రంగా స్పందిం చింది. బీజేపీ భావ‌జాల‌ వాదులు గ‌తంలో బ్రిటీష్, ముస్లిం లీగ్‌కు స‌పోర్టు ఇచ్చార‌ని, స్వతంత్య్ర ఉద్య‌మం వేళ భార‌తీ యుల‌కు వ్య‌తి రేకంగా వాళ్లు ప్ర‌వ‌ర్తించిన‌ట్లు కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లి కార్జున్ ఖ‌ర్గే అన్నారు.

మోడీ-షాకు చెందిన రాజ‌కీయ పూర్వీకులు బ్రిటీష‌ర్లు, ముస్లిం లీగ్‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్లు ఆరో పించారు.

ఇప్పుడు కూడా కాంగ్రెస్ న్యాయ పోరాటానికి వ్య‌తిరేకంగా ముస్లిం లీగ్ వ్య‌వ‌హార శైలిని బీజేపీ ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్లు ఖ‌ర్గే తెలిపారు...

నిజంనిప్పులాంటిది

Apr 08 2024, 19:52

సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ప్ర‌మాదం త‌ప్పింది. రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లోని ల్యాండ్ క్రూజ‌ర్ కారు టైర్ పంక్చ‌ర్ అయి పేలిపోయింది.

కారు స‌డెన్‌గా ఆగిపోయిం ది. దీంతో పోలీసులు ఉలి క్కిప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌ లో ఎవ‌రికీ గాయాలు కాలేదు.

రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ నుంచి కొడంగ‌ల్ వెళ్తున్న స‌మ‌యంలో వికారాబాద్ జిల్లా మ‌న్నెగూడ వ‌ద్ద ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

కాన్వాయ్‌లో వెళ్తున్న నాయ‌ కుల‌కు ఎలాంటి ప్ర‌మాదం సంభ‌వించక‌పోవ‌డంతో పోలీసులు ఊపిరి పీల్చు కున్నారు...

నిజంనిప్పులాంటిది

Apr 08 2024, 12:44

నోట్ల గుట్టలు.. బంగారం సంచులు.. ఎన్నికల వేళ భారీగా పట్టివేత

లోక్‌సభ ఎన్నికలు (Lok sabha Elections) సమీపిస్తున్న వేళ కర్ణాటక (Karnataka)లో భారీగా అక్రమ నగదు, బంగారం బయటపడటం తీవ్ర కలకలం రేపింది..

బళ్లారి (Bellary)లో ఓ వ్యాపారి ఇంట్లో పోలీసులు సోదాలు జరపగా.. రూ.7.6 కోట్ల నగదు, బంగారు, వెండి ఆభరణాలను గుర్తించారు.

బళ్లారిలో హవాలా కార్యకలాపాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం రావడంతో బ్రూస్‌పేట్‌ పోలీసులు రంగంలోకి దిగారు. స్థానిక ఆభరణాల వ్యాపారి నరేశ్‌ సోనీ ఇంట్లో ఆకస్మిక సోదాలు చేపట్టారు. లెక్కల్లోకి రాని భారీ నగదు, ఆభరణాలను గుర్తించారు. రూ.5.6 కోట్ల కరెన్సీ, 103 కిలోల వెండి ఆభరణాలు, 68 వెండి కడ్డీలు, 3 కిలోల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హవాలా మార్గంలో వీటిని తీసుకొచ్చి ఉంటారన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వ్యాపారి నరేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వివరాలను ఆదాయపు పన్ను విభాగానికి అందజేస్తామని, అనంతరం ఐటీ అధికారులు దీనిపై తదుపరి దర్యాప్తు చేపడుతారని తెలిపారు. పోలింగ్‌ దగ్గరపడుతున్న వేళ ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కర్ణాటకలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు రెండు దశల్లో ఏప్రిల్‌ 26, మే 4వ తేదీన పోలింగ్‌ జరగనుంది.

నిజంనిప్పులాంటిది

Apr 08 2024, 12:43

తెలంగాణ మంత్రి పొంగులేటి కుమారుడికి కస్టమ్స్‌ సమన్లు

చెన్నై : తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్‌ విభాగం సమన్లు జారీచేసింది. ఆయన డైరెక్టర్‌గా ఉన్న హైదరాబాద్‌లోని కంపెనీకి వాటిని పంపి విచారణకు హాజరవ్వాలని పేర్కొంది..

ఆయన విదేశాల నుంచి అత్యంత ఖరీదైన చేతి గడియారాలను తెప్పించినట్లు ఆరోపించింది. ఈ నెల 4న తమ ఎదుట హాజరవ్వాలని సమన్లు జారీ చేయగా.. తాను డెంగీ జ్వరంతో బాధపడుతున్నందున రాలేకపోతున్నట్లు ఆయన తెలియజేశారు. ఈనెల 27 తర్వాత హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు..

పీటీఐ వార్తా సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. హాంకాంగ్‌లో ఉంటున్న భారతీయుడు, లగ్జరీ వాచ్‌ల డీలర్‌ ముహమ్మద్‌ ఫహేరుద్దీన్‌ ముబీన్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 5న అలోకం నవీన్‌కుమార్‌ సింగపూర్‌-చెన్నై విమానంలో గడియారాలను తెచ్చాడు. అతడిపై స్మగ్లింగ్‌ కేసు నమోదైంది. ఆ వాచీల విలువ రూ.1.73 కోట్లు. వాటిని హర్షారెడ్డి కోసం తెచ్చినట్లు కస్టమ్స్‌ ఆరోపిస్తోంది..

తాను హర్షారెడ్డికి, ముబీన్‌కు మధ్యవర్తిగా ఉన్నట్లు నవీన్‌కుమార్‌ తెలిపాడు. క్రిప్టో కరెన్సీ ద్వారా హర్షారెడ్డి ఆ డబ్బులు బదలాయించినట్లు విచారణలో బయటపడింది. చెన్నైలోని అలందూరు కోర్టు ఏప్రిల్‌ 1న ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నవీన్‌కుమార్‌ను అరెస్టు చేయడంతో పాటు హర్షారెడ్డిని విచారించేందుకు కస్టమ్స్‌ అధికారులు సిద్ధమయ్యారు. హర్షారెడ్డి పీటీఐతో మాట్లాడుతూ.. కస్టమ్స్‌ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని అన్నారు..

నిజంనిప్పులాంటిది

Apr 08 2024, 12:41

ఏమ్మెల్సీ కవిత బెయిల్ కు కోర్టు నిరాకరణ

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈరోజు తీవ్ర నిరాశ ఎదురయింది.

కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరిం చింది. ఆమె బెయిల్ పిటి షన్ ను కొట్టివేసింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో… తనకు బెయిల్ మంజూరు చేయా లని కోర్టును కవిత కోరారు.

అయితే, కవిత బెయిల్ పై బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టులో ఈడీ వాదనలు వినిపిం చింది. ఇప్పటికే కొందరిని కవిత బెదిరించిందని కోర్టుకు తెలిపింది.

ఈడీ వాదనలతో ఏకీభ వించిన కోర్టు… కవిత బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది.లిక్కర్ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. తొలుత ఈడీ కస్టడీలో ఉన్న కవితకు కోర్టు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.

ఈ క్రమంలో, మార్చి 26వ తేదీ నుంచి ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. రేపటి తో ఆమె జ్యుడీషియల్ రిమాండ్ ముగియబోతోంది. ఆమె జ్యుడీషియల్ రిమాం డ్ ను కోర్టు పొడిగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

నిజంనిప్పులాంటిది

Apr 07 2024, 21:15

ఢిల్లీ పై విజయం సాధించిన ముంబై


ఐపీఎల్‌-17 సీజన్‌లో ముంబయి ఖాతా తెరించింది. ఢిల్లీతో మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో గెలుపొందింది.

235 పరుగుల లక్ష్య ఛేదన కు దిగిన ఢిల్లీ 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులకే పరిమితమైంది. స్టబ్స్‌ (71) పోరాటం వృథా అయ్యింది.

ఓపెనర్‌ పృథ్వీ షా (66), పోరెల్‌ (41), తీవ్ర ప్రయత్నిం చినప్పటికీ దిల్లీకి ఓటమి తప్పలేదు.

ముంబయి బౌలర్లలో కొయెట్జీ 4 వికెట్లు తీయగా, బుమ్రా 2, షెపర్డ్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసిన విషయం తెలిసిందే..

నిజంనిప్పులాంటిది

Apr 07 2024, 20:09

కొండెక్కిన కోడి

చికెన్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో కిలో స్కిన్ లెస్ రూ.294 కి చేరింది.

విత్ స్కిన్ చికెన్ ధర రూ. 258 గా ఉంది. వేసవి తాకిడి కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు అమాంతంగా పెరిగిపోయాయని వ్యాపా రస్తులు చెబుతున్నారు.

గత ఆదివారం కిలో స్కిన్ లెస్ చికెన్ ధర ఇప్పటికంటే సుమారు రూ.30 రూపా యలు తక్కువగా ఉంది.

రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్థులు అభిప్రాయపడుతున్నారు...

నిజంనిప్పులాంటిది

Apr 07 2024, 17:28

నేడు తెలంగాణ లో 44 డిగ్రీలు దాటిన టెంపరేచర్

తెలంగాణ లో ఆదివారం కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావ రణ శాఖ హెచ్చరించింది.

దక్షిణ తెలంగాణలో వేడీ తీవ్రత భారీగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈదురుగాలులు, ఉరు ములు మెరుపులతో కూడిన వానలు పడతా యని వివరించింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాలతో పాటు జనగామ, సిద్దిపేట, మెదక్​, కామారెడ్డి, ములుగు, మహబూబా బాద్, వరంగల్, హనుమ కొండ, జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.

ఉత్త‌ర తెలంగాణ‌కు అల‌ర్ట్‌..

మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రికొత్త గూడెం, ఖమ్మం, సూర్యా పేట, నల్గొండ జిల్లాల్లో అత్యధికంగా టెంపరేచర్ల నమోదవుతున్నాయి.

నల్గొండ జిల్లాలోని 30 మండలాలు, సూర్యాపేట లోని 18 మండలాలు, భద్రాద్రిలోని 19 మండలా లు, ఖమ్మంలోని 18, మంచిర్యాలలోని 11 మండలాలు, పెద్దపల్లి జిల్లాలోని 10 మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..